Vikram: ఆడియో ఫంక్షన్కు అతిథులుగా కోలీవుడ్ బిగ్ స్టార్స్..?
ABN , First Publish Date - 2022-05-14T16:25:10+05:30 IST
విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ (Vikram). ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ 3న ప్రేక్షకులముందుకు రాబోతుంది.
విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ (Vikram). ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ 3న ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. కమల్ నుంచి సినిమా వచ్చి చాలా లాంగ్ గ్యాప్ రావడంతో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వరూపం 2 (Vishwaroopam 2) తర్వాత కమల్ నుంచి రాబోతున్న విక్రమ్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లుకొడుతోంది. ఈ మే 15వ తేదీన విక్రమ్ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే, అదే రోజు సాయంత్రం ఘనంగా ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవలే 'సేవ్ ది డేట్' అంటూ ఓ పోస్టర్ను వదిలారు. అయితే, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆడియో ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth), సూర్య (Surya), విజయ్ (Vijay) గెస్టులుగా రాబోతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్ అవుతోంది.
ఇది నిజమై ఒకే వేదికపైన కమల్తో పాటు రజనీకాంత్, సూర్య, విజయ్ కనిపిస్తే చూసేందుకు రెండు కళ్ళూ చాలవని ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. మరీ మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇవ్వనున్నారో చూడాలి. కాగా, ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో కమల్తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathy), ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.