Major సినిమాపై రాములమ్మ ప్రశంసలు.. అలాంటి సినిమాలు రావడం అభినందనీయమంటూ..

ABN , First Publish Date - 2022-07-15T16:25:48+05:30 IST

దాదాపు 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలకి దీటుగా సినిమాలు తీసి.. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి...

Major సినిమాపై రాములమ్మ ప్రశంసలు.. అలాంటి సినిమాలు రావడం అభినందనీయమంటూ..

దాదాపు 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలకి దీటుగా సినిమాలు తీసి.. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి (Vijayashanthi). పలు చిత్రాల్లో నటులతో సమానంగా ఫైట్స్ చేసిన ఈ సీనియర్ నటి లేడీ అమితాబ్ బచ్చన్ అనిపించుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయశాంతి పొలిటిషియన్‌గా కూడా మంచి పేరునే సాధించారు. చాలా ఏళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈమె ఇటీవలే మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’తో సినిమాలకు రీఎంట్రీ ఇచ్చారు.


ముంబై ఎటాక్స్ 26/11 ప్రాణాలు అర్పించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎదుర్‌కుం తునిందవన్’. ఈ మూవీ సైతం మంచి హిట్ అందుకుంది. ఈ రెండు చిత్రాలపై విజయ్ శాంతి సోషల్ మీడియాలో స్పందించారు.


విజయశాంతి చేసిన పోస్ట్‌లో.. ‘ఎదుర్‌కుం తునిందవన్ (etharkum thuninthavan).. మేజర్ (Major).. ఈ మధ్య కొంచెం సమయ విరామ అవకాశంలో చూసిన చిత్రాలలో మానవ సంబంధాల విలువని, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణిని, భావోద్వేగాలను ఒక చిత్రం...


దేశం పట్ల సైనికులకు ఉండే బాధ్యతను, సైన్యంలో చేరే పౌరులకు ఉండే జాతీయభావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పగలిగిన... చెప్పిన సినిమా మరో చిత్రం అనిపించాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రజా శ్రేయస్సుని, అంకితభావంతో నిజాయతీగా ప్రేక్షకులను ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందనీయమే..’ అని పొగుడుతూ రాసుకొచ్చారు.



Updated Date - 2022-07-15T16:25:48+05:30 IST