Vijay Sethupathi: అదే జరిగితే ప్రేక్షకులు నా క్యారెక్టర్ని ఇష్టపడరు
ABN , First Publish Date - 2022-12-07T14:30:01+05:30 IST
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) - ‘ఇళయ దళపతి’ విజయ్ (Vijay) కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) - ‘ఇళయ దళపతి’ విజయ్ (Vijay) కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది విజయ్కి 67వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్పైకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అయతే.. ఇందులో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Lokesh Kanagaraj) మరోమారు ప్రతి నాయకుడిగా కనిపించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ న్యూస్పై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు.
‘‘విక్రమ్’ చిత్రంలో నేను పోషించిన ‘సంతానం’ పాత్ర ఆ చిత్రంతోనే ముగిసిపోయింది. మళ్లీ ఆ పాత్రకు ప్రాణం పోసేందుకు అభిమానులు ఇష్టపడరు. అందువల్ల ‘విక్రమ్’ మూడో భాగంలో లేదా విజయ్ 67వ చిత్రంలో సంతానం క్యారెక్టర్కు అవకాశం లేదు. ఇకపోతే.. విజయ్ 67వ చిత్రం కోసం ఇప్పటివరకు దర్శకుడు లోకేష్ నన్ను సంప్రదించ లేదు. అందువల్ల ఆ చిత్రంలో ఖచ్చితంగా నేను నటించడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను’ అని అన్నారు. కాగా, విజయ్ సేతుపతి విలన్ పాత్రల్లో నటించిన విజయ్ ‘మాస్టర్’, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ‘విక్రమ్’ సినిమాలోని ఆయన చేసిన సంతానం క్యారెక్టర్కి ప్రశంసలు సైతం వచ్చాయి. అందుకే ఆ పాత్రని లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లోని ఇతర చిత్రాల్లో కూడా కొనసాగిస్తారని ప్రేక్షకులు, విజయ్ సేతుపతి అభిమానులు ఆశించారు.