Vijay Deverakonda: నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్స్..!
ABN , First Publish Date - 2022-10-20T01:41:14+05:30 IST
సినీ ఇండస్ట్రీలో గాడ్ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత
సినీ ఇండస్ట్రీలో గాడ్ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ‘రౌడీ’ హీరో నుంచి వచ్చిన ‘లైగర్’ (Liger) బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాన్ని మిగిల్చింది. పట్టాల పైన ఉన్న ‘ఖుషి’ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న సమంత ఆరోగ్య సమస్యలతో సతమత మవుతుండటంతో షూటింగ్ జరగడం లేదు. అందువల్ల విజయ్ దేవరకొండ కొత్త సినిమాలను ఒకే చేసే పనిలో పడ్డాడు. స్క్రిఫ్ట్లను వింటున్నాడు. నెక్ట్స్ మూవీకి సంతకం చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
‘జెర్సీ’ (Jersey) ఫేం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) విజయ్ దేవరకొండకు ఓ లైన్ను వినిపించాడట. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా ఉండేలా కథను డిజైన్ చేస్తానని చెప్పాడట. అతడు చెప్పిన లైన్కు విజయ్ ఫిదా అయ్యాడట. పూర్తి స్క్రిఫ్ట్ను సిద్ధం చేయమని కోరాడట. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ను మొదలుపెట్టాలనే ఆలోచనలో విజయ్ ఉన్నాడట. కొత్త సినిమా పట్టాలెక్కేలోపు ‘ఖుషి’ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ను పూర్తి చేసే పనిలో గౌతమ్ ఉన్నట్టు సమాచారం. అయితే, రామ్ చరణ్ (Ram Charan)తో గౌతమ్ సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ‘లైగర్’ విడుదలకు ముందే విజయ్ ‘జనగణమన’ ను పట్టాలెక్కించాడు. కానీ, లైగర్ సినిమా పరాజయం కావడంతో ‘జనగణమన’ ఆటకెక్కింది.