వారు మూవీ ఓపెనింగ్‌కి రాలేదని విజయ్ దేవరకొండ ఏం చేశాడంటే?

ABN , First Publish Date - 2022-04-22T03:11:04+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ 19వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు

వారు మూవీ ఓపెనింగ్‌కి రాలేదని విజయ్ దేవరకొండ ఏం చేశాడంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ 19వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం గ్రాండ్‌గా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు. 


కొరటాల శివ, బాబీ వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకకు హీరోయిన్ సమంత, ఇతర పాత్రలలో నటించనున్న వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ.. హాజరు కాలేదు. దీంతో విజయ్ దేవరకొండ వినూత్నంగా ఆలోచించి.. వారు కూడా ఈ వేడుకకు హాజరైనట్లుగా క్రియేట్ చేసిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. విజయ్ పోస్ట్ చేసిన ఫొటోలను మీడియా వారు ప్రచురించాలని అతనే కాకుండా  మైత్రీ సంస్థ కూడా కోరింది. అయితే విజయ్ చేసిన ఈ పనిపై బీభత్సంగా కామెంట్స్ పడుతున్నాయి. వారు ఈ వేడుకకు రాలేదని.. కావాలనే వారికి తగిలేలా.. విజయ్ ఈ పని చేశాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు సూపర్బ్ క్రియేటివిటీ అంటూ విజయ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. విజయ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు సమంత కూడా రెస్పాండ్ అయింది. ట్విట్టర్ వేదికగా రిప్లయ్ ఇచ్చిన సమంత.. రాలేకపోయినందుకు బాధపడుతున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. 







Updated Date - 2022-04-22T03:11:04+05:30 IST