చిరంజీవి, మహేష్ బాబు తర్వాత ఆ అవకాశం విజయ్ దేవరకొండకే!
ABN , First Publish Date - 2022-01-31T22:47:30+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోకాకోలా బ్రాండ్ థమ్సప్కు బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వారి తర్వాత టాలీవుడ్ నుండి ఈ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు సెన్సేషనల్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోకాకోలా బ్రాండ్ థమ్సప్కు బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వారి తర్వాత టాలీవుడ్ నుండి ఈ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన క్రేజ్ గురించి చెప్పాలంటే.. అతి తక్కువ టైమ్లోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన స్టైల్, డిఫరెంట్ యాటిట్యూడ్తో యూత్ ఐకాన్గా మారారు. సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ రూపంలో, సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంటాడీ రౌడీ. ఇప్పుడతని క్రేజ్కు నిదర్శనంగా ఇలా ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
ఇకపై థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నారు. రౌడీ స్టార్ బ్రాండింగ్ చేస్తుండటంతో తమ ప్రాడక్ట్ మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. థమ్సప్కు విజయ్ బ్రాండింగ్ చేస్తున్నారనే ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాన్, రౌడీ ఫర్ థండర్ వంటి యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ యాడ్ మంగళవారం నుండి అఫీషియల్గా సోషల్ మీడియా, టీవీలలో ప్రసారం కాబోతుంది.