Vijay Deverakonda: సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2022-08-27T21:56:01+05:30 IST
‘లైగర్’ (Liger) సినిమాతో పరాజయం చూసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు తన తదుపరి సినిమా అయిన ‘ఖుషి’ (Kushi) మీద దృష్టి పెట్టాడు. ముందుగా అనుకున్న ప్రకారం
‘లైగర్’ (Liger) సినిమాతో పరాజయం చూసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు తన తదుపరి సినిమా అయిన ‘ఖుషి’ (Kushi) మీద దృష్టి పెట్టాడు. ముందుగా అనుకున్న ప్రకారం విజయ్ దుబాయ్లో రెండు రోజుల ఈవెంట్కి హాజరు అవుతున్నాడు. అటునుండి వచ్చాక, తన తదుపరి చిత్రం అయిన ‘ఖుషి’ షూటింగ్లో పాల్గొంటాడని తెలిసింది. ‘లైగర్’ పరాజయాన్ని పట్టుకొని కూర్చొనే కంటే, పని మీద బాగా దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయానికి విజయ్ వచ్చాడని తెలిసింది.
అందుకే దుబాయ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేయకుండా, హాజరు అవ్వాలనే సంచలన నిర్ణయాన్ని విజయ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత నేరుగా ‘ఖుషి’ సినిమా షూటింగ్లో పాల్గొంటాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ ‘ఖుషి’ సినిమాకి దర్శకుడు కాగా, సమంత (Samantha) కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు విజయ్కి ఒక మంచి హిట్ సినిమా కావాలి, అందుకోసం.. అతని దృష్టంతా ఈ ‘ఖుషి’ మీదనే పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.