అందరి కళ్లూ.. వీళ్లపైనే!

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

విజయ్‌ దేవరకొండ - రష్మిక... వెండి తెరపై హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ వంద కోట్ల సినిమాగా నిలిచింది.

అందరి కళ్లూ.. వీళ్లపైనే!

విజయ్‌ దేవరకొండ - రష్మిక... వెండి తెరపై హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ వంద కోట్ల సినిమాగా నిలిచింది. ‘డియర్‌ కామ్రేడ్‌’ అంతగా ఆకట్టుకోకపోయినా వీరిద్దరి కెమిస్ర్టీకి ఫుల్‌ మార్కులు పడ్డాయి. ఆ చిత్రం నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారన్న వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని రష్మిక ఖండించింది కూడా. అయితే ఇప్పుడు మళ్లీ ఈ వార్తలకు రెక్కలొచ్చాయి. దానికీ కారణం ఉంది. ఇటీవల ఈ జంట ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించారు. ఇద్దరూ మాల్దీవుల్లో విహారానికి వెళ్లారనే వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌. సమంత గైర్హాజరుతో ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ వచ్చింది. దాంతో విజయ్‌ రిలాక్స్‌ అవ్వడానికి కొంత సమయం దక్కింది. మరోవైపు రష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయి. కొన్ని నెలలుగా తీరిక లేకుండా గడుపుతోంది. అందుకే ఇప్పుడు కొంత విరామం తీసుకొంది. ఇద్దరూ కలిసికట్టుగా మాల్దీవులకు వెళ్లారో లేదంటే వీరి ప్రయాణం అనుకోకుండా జరిగిందో తెలీదు కానీ.. ప్రస్తుతానికి వీరి మాల్దీవుల యాత్ర హాట్‌ టాపిక్‌ గా మారింది.

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST