కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా.. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC), పీవీపీ (PVP) బ్యానర్లపై.. దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish), పరమ్ వి పొట్లూరి (Param V Potluri), పెరల్ వి పొట్లూరి (Pearl V Potluri) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేశామని.. ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘విజయ్66’ (Vijay66) వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు తాజా షెడ్యూల్లో జరిగిన షూటింగ్లో పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్కి వచ్చి షూట్లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగిందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్గా.. హర్షిత్ రెడ్డి, హన్షిత సహ నిర్మాతలుగా.. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. విజయ్ కెరీర్లో భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.