పెళ్లయ్యాక Nayanthara తో కలసి తీసుకున్న మొట్టమొదటి ఫొటోను పోస్ట్ చేసి.. Vignesh Shivan ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-06-09T21:53:00+05:30 IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ల పెళ్లి (Wedding) జూన్ 9న ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో ఈ జంట ఏడడుగులు వేశారు. విఘ్నేశ్ శివన్

పెళ్లయ్యాక Nayanthara తో కలసి తీసుకున్న మొట్టమొదటి ఫొటోను పోస్ట్ చేసి.. Vignesh Shivan ఏమన్నాడంటే..

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ల పెళ్లి (Wedding) జూన్ 9న ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో ఈ జంట ఏడడుగులు వేశారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నేను రౌడినే’ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు వీరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. 


దంపతులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో విఘ్నేశ్ శివన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘ఇప్పుడే మా పెళ్లి అయింది. మా జంటకు 10మార్కులు వేస్తే, నయన్‌కు 9, నాకు 1 వస్తాయి. దేవుడు, తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మేం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాం’’ అని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో చెప్పారు. ఈ క్రమంలో నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, రజినీకాంత్, అజిత్, బొనీ కపూర్, విజయ్ సేతుపతి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.



Updated Date - 2022-06-09T21:53:00+05:30 IST