పెళ్లి తర్వాత మొదటి సారి షూటింగ్కి వెళ్లిన Vicky Kaushal.. కత్రినా కైఫ్ ఎక్కడంటూ కామెంట్స్
ABN , First Publish Date - 2021-12-19T19:52:11+05:30 IST
బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9 పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. రాజస్థాన్లో జరిగిన వీరి గ్రాండ్ వెడ్డింగ్ గురించి గత కొన్ని నెలలుగా ఎంతో బజ్ క్రియేట్ చేసింది...
బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9 పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. రాజస్థాన్లో జరిగిన వీరి గ్రాండ్ వెడ్డింగ్ గురించి గత కొన్ని నెలలుగా ఎంతో బజ్ క్రియేట్ చేసింది. అయితే పెళ్లి జరిగిన దాదాపు 9 రోజుల తర్వాత ఈ ‘ఉరి’ స్టార్ తన నెక్ట్ మూవీ షూటింగ్కి వెళ్లాడు. దీని సంబంధించిన ఓ పిక్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఈ యంగ్ హీరో.
అందులో.. మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత షూటింగ్ వెళుతూ కారులో కూర్చున్న ఫోటోని షేర్ చేశాడు. దీనికి కాఫీ, క్లాప్ బోర్డ్ క్యాప్షన్ పెట్టాడు. కొత్త పెళ్లి కొడుకు మొదటిసారి ఇలా సెల్ఫీని పోస్ట్ చేయడంతో ఈ పిక్ వైరల్గా మారింది. దీంతో దీనిపై ఎంతో మంది అభిమానులు కత్రినా ఎక్కడంటూ కామెంట్ల వర్షం కురింపించారు.
‘ఈ ఫోటోలో వదిన కనిపించట్లేందెంటి భాయ్’ అంటూ కొందరు.. ‘కత్రినా బావూజీ ఎక్కడ ఉంది భయ్యా?’ అంటూ ఇంకొందరు.. ‘దయచేసి కత్రినాతో కలిసి ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేయండి’ అని మరికొందరు కామెంట్స్ పెట్టారు.
అయితే, విక్కీ ప్రస్తుతం ‘గోవిందా నామ్ హై మేరా’లో చేస్తుండగా.. ఇందులో హీరోయిన్లుగా కియారా అడ్వాణీ, భూమి పడ్నేకర్ నటిస్తున్నారు. అలాగే దినేష్ విజన్ దర్శకత్వంలో సారా అలీఖాన్ హీరోయిన్గా మరో చిత్రం చేస్తున్నాడు. కాగా, కత్రినా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ‘టైగర్ 3’ చేస్తోంది. త్వరలో ఢిల్లీలో జరిగే ఈ మూవీ తదుపరి షెడ్యూల్లో పాల్గొననుంది ఈ బ్యూటీ.