వెటరన్ స్ర్కీన్ రైటర్ కన్నుమూత
ABN , First Publish Date - 2022-04-23T23:58:44+05:30 IST
మలయాళం ఇండస్ట్రీలో వెటరన్ స్క్రీన్ రైటర్గా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు జాన్ పాల్ పుతుస్సేరి
మలయాళం ఇండస్ట్రీలో వెటరన్ స్క్రీన్ రైటర్గా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు జాన్ పాల్ పుతుస్సేరి. దాదాపుగా 100కు పైగా సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు. ఆయన వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత రెండు నెలలుగా ఆ సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తాజాగా ఆయన మృతి చెందారు.
డ్రామా, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిధ జోనర్లకు చెందిన సినిమాలకు జాన్ పాల్ పుతుస్సేరి స్క్రీన్ ప్లేను అందించారు. స్టార్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వం వహించిన ‘చమరం’ సినిమాతో స్క్రీన్ ప్లే రైటర్గా కెరీర్ను మొదలుపెట్టారు. ‘పాలంగల్’, ‘ఓరు మిన్నమినుంగింటె నురుంగు వెట్టం’,‘యాత్రా’ చిత్రాలకు స్క్రీన్ ప్లేను అందించారు. బాలు మహేంద్ర, వి. శశి, సేతు మాధవన్, జోషి తదితర ఫిల్మ్ మేకర్స్తో కలసి జాన్ పనిచేశారు. ఆయన మరణ వార్త తెలియగానే కేరళ విద్యా శాఖ మంత్రి శివన కుట్టి సంతాపం వ్యక్తం చేశారు.