ఫిబ్రవరిలోనే ‘దృశ్యం’ దర్శకురాలి కూతురి పెళ్లి.. లండన్‌లో ఓ సారి, చెన్నైలో మరోసారి..

ABN , First Publish Date - 2022-02-04T21:15:34+05:30 IST

దక్షిణాది భాషలన్నింటిలో నటించి పేరు తెచ్చుకున్న తార శ్రీ ప్రియ. శివాజీ గణేశన్, శివ కుమార్

ఫిబ్రవరిలోనే ‘దృశ్యం’ దర్శకురాలి కూతురి పెళ్లి.. లండన్‌లో ఓ సారి, చెన్నైలో మరోసారి..

దక్షిణాది భాషలన్నింటిలో నటించి పేరు తెచ్చుకున్న తార శ్రీ ప్రియ. శివాజీ గణేశన్, శివ కుమార్, కమల్ హాసన్, రజినీ కాంత్ వంటి హీరోల సరసన ఆమె నటించింది. అనంతరం దర్శకురాలు, నిర్మాత‌గా కూడా మారింది. టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి ఆమెనే దర్శకత్వం వహించింది. తాజా కబురేంటంటే త్వరలోనే ఆమె కూతురు పెళ్లి జరగనుందని తెలుస్తోంది. 


రాజ్ కుమార్ సేతుపేతిని శ్రీ ప్రియ 1988లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నాగార్జున, స్నేహా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. స్నేహా వివాహం త్వరలోనే జరగనుంది. ఫిబ్రవరి 6న లండన్‌లో అన్మోల్ శర్మ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడనుంది. భారత్‌లోని అతిథుల కోసం చెన్నైలో కూడా సౌత్ ఇండియన్ స్టైల్‌లో వెడ్డింగ్‌ జరపనున్నారు. ఈ వేడుకను ఏప్రిల్ 4,5,6 తేదీల్లో ఏర్పాటు చేశారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. చెన్నైలో‌ జరిగే వివాహానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.



Updated Date - 2022-02-04T21:15:34+05:30 IST