‘జైత్ర’కు విజయం తథ్యం: డైరెక్టర్ వేణు ఉడుగుల
ABN , First Publish Date - 2022-09-26T04:42:05+05:30 IST
ఒక రైతు కథతో చాలా న్యాచురల్గా రాబోతోన్న ‘జైత్ర’ సినిమాకు విజయం తథ్యమని అన్నారు ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల. అల్లం శ్రీతన్మయి సమర్పణలో..
ఒక రైతు కథతో చాలా న్యాచురల్గా రాబోతోన్న ‘జైత్ర’ సినిమాకు విజయం తథ్యమని అన్నారు ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల. అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ని ఇటీవలే విడుదల చేవారు. రాయలసీమ స్లాంగ్, నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడో లిరికల్ సాంగ్ ‘సందమామయ్యాలో’ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు.
పాట విడుదల చేసిన అనంతరం వేణు ఉడుగుల మాట్లాడుతూ... జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్, టీజర్ బాగున్నాయి. ఈ సినిమాకు విజయం తథ్యం. ఫణి కళ్యాణ్ సంగీత సారధ్యంలో రూపుదిద్దుకున్న సందమామయ్యాలో సాంగ్ చాలా బాగుంది. దర్శకుడు మల్లికార్జున్ తోట, నిర్మాత అల్లం సుభాష్కు ఈ ‘జైత్ర’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.