Rana Naidu కోసం వెంకీ కూతురు వెయిటింగ్..
ABN , First Publish Date - 2022-06-02T15:53:57+05:30 IST
విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) - రానా (Rana) కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) - రానా (Rana) కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక ఓ సారి క్రిష్ (Krish) రూపొందించిన కృష్ణం వందే జగద్గురుం (Krishnam Vande Jagadgurum) సినిమాతో తీరింది. కానీ, అభిమానులకు అది సరిపోలేదు. పూర్తి స్థాయిలో మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలనేది వారి కోరిక. అయితే, వెంకీ - రానా కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో..ఇద్దరికీ సరిపోయే కథ ఎప్పుడు దొరుకుందో తెలీదు గానీ, డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ మాత్రం చేశారు.
'రానా నాయుడు' (Rana Naidu) అనే పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది. దీనికోసం అభిమానుల కంటే ఆతృతగా వెంకీ కూతురు ఆశ్రిత (Aashritha) ఎదురుచూస్తున్నట్టుగా తెలిపింది. తన తండ్రి, అన్నయ్యను ఒకే ఫ్రేంలో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇటీవల వెంకీ.. 'రానా నాయుడు' సిరీస్ గురించి స్పందించారు. "ఈ వెబ్ సిరీస్ యూనిట్తో పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అవుతుంది. వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది".. అని వివరించారు.
అలాగే, సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలకే ఆశ్రిత లవ్ సింబల్తో తన అభిమానాన్ని చాటుకుంది. కాగా, ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ వచ్చేఏడాది సంక్రాంతికి స్ట్రీమింగ్ చేయబోతోంది. చూడాలి మరి ఒకేసారి ఇద్దరు దగ్గుబాటి స్టార్స్ నటించిన 'రానా నాయుడు' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో. ఇక వెంకటేశ్ త్వరలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్తో కలిసి హిందీ సినిమాలో నటించబోతున్నారు. అలాగే, రానా నటించిన 'విరాట పర్వం' జూన్ 17వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.