Mega 154 : ఈ కొత్త షాకేంటి?

ABN , First Publish Date - 2022-09-12T16:55:38+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (Godfather) టాకీ పార్ట్ పూర్తి చేసుకొని.. వచ్చే నెల 5న విడుదలవడానికి రెడీగా ఉంది. మోహన్ రాజా (Mohanraja) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార (Nayanathara) కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చిరు.. నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది.

Mega 154 : ఈ కొత్త షాకేంటి?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (Godfather) టాకీ పార్ట్ పూర్తి చేసుకొని.. వచ్చే నెల 5న విడుదలవడానికి రెడీగా ఉంది. మోహన్ రాజా (Mohanraja) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార (Nayanathara) కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా చిరు.. నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే వీటితో పాటు చిరంజీవి 154 చిత్రం కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. Mega 154 గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్ ను ఖాయం చేయబోతున్నట్టు.. లీకులందిన విషయం తెలిసిందే. బాబీ (Bobby) దర్శకత్వంలో వాల్తేరు బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది సినిమా. ఇందులో చిరంజీవి మాస్ గెటప్ అభిమానుల్ని ఫిదా చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 


ఇందులో మాస్ మహారాజా రవితేజ (Raviteja) కూడా నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే ఇద్దరిపైనా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం Mega 154లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గెస్ట్ గా నటిస్తున్నారని వినికిడి. క్లైమాక్స్ లో హీరో వెంకీ సరదాగా అతిథి పాత్రలో కనిపిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇందులో వెంకీ కానీ నటిస్తే.. సినిమాపై మరింత హైపు పెరుగుతుందని వేరే చెప్పాలా? 


కెరీర్ తొలి నాళ్ళలో తాను చిరంజీవిని అనుకరిస్తానని వెంకీ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు . ఆ తర్వాత కాలంలో వెంకటేశ్ నటించిన ‘త్రిమూర్తులు’ (Trimurthulu) చిత్రంలో ఓ పాటలో అతిథిపాత్రలో చిరంజీవి తళుక్కుమన్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘నసీబ్’ (Naseeb) చిత్రానికి ‘త్రిమూర్తులు’ అఫీషియల్ రీమేక్. ఇందులో వెంకటేశ్‌తో పాటు అర్జున్ (Arjun), రాజేంద్రప్రసాద్ (Rajendraprasad) హీరోలు. అమితాబ్, శత్రుఘ్నసిన్హా రిషీ కపూర్ హీరోలుగా నటించిన ‘నసీబ్‌’ చిత్రంలో ‘జాన్ జానీ జనార్ధన్’ అనే పాటలో బాలీవుడ్ స్టార్స్ అందరూ కనిపిస్తారు.  తెలుగు వెర్షన్‌లో కూడా ఆ పాట ఉంటుంది. ఆ క్రమంలో చిరంజీవి కూడా కనిపిస్తారు. ఇప్పుడు చిరంజీవి చిత్రంలో వెంకటేశ్ నటించబోతుండడం విశేషంగా మారింది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే... కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-09-12T16:55:38+05:30 IST