వీరభద్రమ్... క్రైమ్ థ్రిల్లర్
ABN , First Publish Date - 2022-05-29T07:06:48+05:30 IST
‘అహనా పెళ్లంట’, ‘పూల రంగడు’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు వీరభద్రమ్. కాస్త గ్యాప్ తరవాత.. ఇప్పుడు థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు...
‘అహనా పెళ్లంట’, ‘పూల రంగడు’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు వీరభద్రమ్. కాస్త గ్యాప్ తరవాత.. ఇప్పుడు థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరభద్రమ్ దర్శకత్వంలో నరేష్ అగస్త్య కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దక్కన్ డ్రీమ్వర్క్స్ పతాకంపై నబిషేక్, తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ‘‘వీరభద్రమ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈసారి ఆయన క్రైమ్ థ్రిల్లర్ కథ సిద్ధం చేశారు. కథ బాగా నచ్చింది. ఈ కథకు నరేష్ అగస్త్య అయితే న్యాయం చేస్తారనిపించి, ఆయన్ని హీరోగా ఎంచుకొన్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు.