హైదరాబాద్లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాను: వరలక్ష్మి శరత్ కుమార్
ABN , First Publish Date - 2022-03-08T02:22:39+05:30 IST
కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ వరలక్ష్మి శరత్ కుమార్
కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ వరలక్ష్మి శరత్ కుమార్. ఏ ఇండస్ట్రీ అయినా సరే బలమైన పాత్రలు వస్తే తప్పక నటిస్తానంటోంది. శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుందామె. ‘విక్రమ్ వేద’, ‘సర్కార్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. ‘నాంది’లో లాయర్గా, ‘క్రాక్’లో జయమ్మగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దీంతో టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెలువెత్తుతున్నాయి. ఫలితంగా చెన్నై నుంచి తన నివాసాన్ని హైదరాబాద్కు మార్చింది.
ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ‘యశోద’, ‘మైకేల్’, ‘హనుమాన్’, ‘ఆద్య’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఆమె మార్చి 5న పుట్టిన రోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆయా చిత్ర బృందాలు ఆమెకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేశాయి. కాగా, వరుస సినిమాల నేపథ్యంలో చెన్నైను వదిలిపెట్టి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వరలక్ష్మి ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ మెసేజ్ను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. ‘‘ఈ పుట్టిన రోజు నాకు అద్భుతమైనది. మంచి, చెడుల్లో నాకు అండగా నిలిచిన శ్రేయేభిలాషులందరికీ కృతజ్ఞతలు. గత వారాన్ని చెన్నైలో వారితోనే గడిపాను. నా జీవితంలో ఇక మీద కొత్త ప్రయాణాన్ని హైదరాబాద్లో మొదలుపెడుతున్నాను. నేను హైదరాబాద్కు నా మకాం మారుస్తున్నాను. నాకు నెర్వస్గా ఉంది. మీరందరూ నాకు అండగా ఉంటారని తెలుసు. లవ్ యూ గాయ్స్. నేను మాటల్లో చెప్పిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలవలేను. ఎందుకంటే మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీ దీవెనలు, సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ కావాలి’’ అని వరలక్ష్మి చెప్పింది.