‘వాడు ఎవడు’.. వచ్చేందుకు రెడీ!

ABN , First Publish Date - 2022-09-04T05:00:31+05:30 IST

కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరోహీరోయిన్లుగా రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాసరావు నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘వాడు ఎవడు’. సెన్సార్ పూర్తి చేసుకున్న..

‘వాడు ఎవడు’.. వచ్చేందుకు రెడీ!

కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరోహీరోయిన్లుగా రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాసరావు నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘వాడు ఎవడు’. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఎన్నో వైవిధ్యమైన, ఉత్కంఠమైన సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూఏ (U/A) సర్టిఫికెట్ వచ్చింది. త్వరలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇలాంటి విభిన్న సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అని అన్నారు. 

Updated Date - 2022-09-04T05:00:31+05:30 IST