హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ (Vijay), శ్రావ్య (Sravya) జంటగా.. రాజారెడ్డి పానుగంటి (Rajareddy Panuganti) దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్ (V Sai LakshmiNarayana Goud), పి శ్రవణ్ కుమార్ (P Sravan Kumar) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కేరాఫ్ మహాదేవపురం (Mahadevapuram) అనేది ట్యాగ్లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ని మంచు మనోజ్ (Manchu Manoj) విడుదల చేశారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ బాగుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ మా చిత్ర టీజర్ని విడుదల చేసిన మంచు మనోజ్ గారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు. సినిమాకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అని తెలపగా.. చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. దుబాయ్లో, కొండమడుగు ఊరిలో షూటింగ్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్స్ సాయి, శ్రావణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. ఏం కావాలంటే అది కాదనకుండా అన్ని సమకూరుస్తూ ఈ చిత్రం ఒక రేంజ్లో రావడానికి కారణమయ్యారు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, డైరెక్షన్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరికీ ధన్యవాదాలు..’’ అన్నారు. ‘‘దర్శకుడు పానుగంటి పని రాక్షసుడు.. మేము కొత్త వారిమైనా సరైన అవుట్ పుట్ వచ్చే వరకు మాతో యాక్ట్ చేయించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. సాయి, శ్రావణ్ ఇద్దరూ కలిసి నాకు పునర్జన్మ ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు చిత్ర హీరో విజయ్.