డైమండ్స్తో కూడిన డ్రెస్ ధరించిన Urvashi Rautela.. ధర విని అవాక్కయిన అభిమానులు..
ABN , First Publish Date - 2021-12-16T23:08:55+05:30 IST
అందం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా. మోడల్గా కెరీర్ను ఆరంభించి అనంతరం
అందం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా. మోడల్గా కెరీర్ను ఆరంభించి అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్లో కెరీర్ను ఆరంభించింది. సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ-4 వంటి తదితర చిత్రాల్లో నటించింది. భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.
తాజాగా ఇజ్రాయిల్లో మిస్ యూనివర్స్-2021 పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఊర్వశి రౌతేలా జడ్జీగా వ్యవహరించింది. అనంతరం భారత్కు ఆమె విచ్చేసింది. ముంబై ఎయిర్పోర్టులో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి ఆమె కనిపించింది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు ఆమెను క్లిక్మనించారు. ఆమె ధరించిన డ్రెస్ ధర తెలుసుకొని అవాక్కయ్యారు. ఆ డ్రెస్ ధర దాదాపుగా రూ.5లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆ డ్రెస్లో డైమండ్లను వాడటం మరో విశేషం. ఊర్వశి ధరించిన చెవి దిద్దులు కూడా డైమండ్తోనే రూపొందాయి. ఈ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్కు చెందిన హర్నాజ్ సంధూ కిరీటాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే.