స్టార్ క్రికెటర్‌ను వాట్సప్‌లో బ్లాక్ చేసిన ఊర్వశి రౌతేలా

ABN , First Publish Date - 2021-12-31T00:10:57+05:30 IST

రిషబ్ పంత్‌తో స్నేహితురాలిగా కొనసాగాలని ఊర్వశి భావించింది. కానీ, రిషబ్ పంత్‌కు ఆమెతో సంబంధాలు కొనసాగించడం ఇష్టం లేదు

స్టార్ క్రికెటర్‌ను వాట్సప్‌లో బ్లాక్ చేసిన ఊర్వశి రౌతేలా

భారత్‌లో సినిమాలు, క్రికెట్‌ను విడదీసి చూడలేం. అనుష్క శర్మ, గీతా బస్రా, సాగరిక ఘట్కే, షర్మిలా ఠాగూర్ వంటి తారలు క్రికెటర్లను పెళ్లి చేసుకున్నారు. భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్‌, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కొన్ని రోజులు ప్రేమించుకున్నారు. గతంలో అనేక సార్లు డిన్నర్ డేట్‌‌లల్లో మీడియా కంట పడ్డారు. కొంత కాలం డేటింగ్ కూడా చేశారు. ఇద్దరి మధ్య ఏమయిందో తెలియదు కానీ అనంతరం విడిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాట్పాప్‌లో కూడా ఒకరిని, మరొకరు బ్లాక్ చేసుకున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


‘‘ రిషబ్ పంత్‌తో స్నేహితురాలిగా కొనసాగాలని ఊర్వశి భావించింది. కానీ, పంత్‌కు ఆమెతో సంబంధాలు కొనసాగించడం ఇష్టం లేదు. అందువల్ల ఆమెను వాట్సప్‌లో బ్లాక్ చేశారు. దీంతో ఆమె కూడా రిషబ్‌ను బ్లాక్ చేసింది ’’ అని  ఊర్వశి రౌతేలా తరఫు వ్యక్తి చెబుతున్నారు. రిషబ్ పంత్ ఆమెతో విడిపోయాక మరొకరిని ప్రేమిస్తున్నట్టు కొంత కాలం క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


ఇషా నేగిని ప్రేమిస్తున్నట్టు  ఇన్‌స్టాగ్రాంలో రిషబ్ పంత్ 2019లో తెలిపారు. ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఊర్వశి రౌతేలా బ్లాక్ రోజ్ అనే తెలుగు-హిందీ ద్విభాషా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఆమె రంగప్రవేశం చేయబోతుంది.

Updated Date - 2021-12-31T00:10:57+05:30 IST