Vishal: తమిళ హీరో ఇంటిపై రాళ్ల దాడి.. ఆందోళనలో అభిమానులు

ABN , First Publish Date - 2022-09-28T18:00:54+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటుల్లో విశాల్ (Vishal) ఒకరు.

Vishal: తమిళ హీరో ఇంటిపై రాళ్ల దాడి.. ఆందోళనలో అభిమానులు

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటుల్లో విశాల్ (Vishal) ఒకరు. వరుసగా యాక్షన్ మూవీస్‌తో తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా.. ఏ విషయం గురించైనా ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతుంటాడు. దీంతో తరచుగా ఇబ్బందుల్లో పడుతుంటాడు. తాజాగా విశాల్ ఇంటిపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 


విశాల్ గత కొంతకాలంలో చెన్నైలోని అన్నా నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోని కొందరూ వ్యక్తులు ఎరుపు రంగు కారులో వచ్చి విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దుండగులు దాడి చేస్తున్న సమయంలో విశాల్ ఇంట్లో లేడని తెలుస్తోంది. అయితే.. కారు విషయాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్న విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సినీ పరిశ్రమలో విశాల్ అంటే పడనివారే ఇలా చేశారా.. లేక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే.. తమిళ చిత్ర పరిశ్రమ నడిగర్ సంఘానికి విశాల్ ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అలాగే.. ఇటీవలే రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. విశాల్ ఇంటిపై దాడి విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన త్వరగా పట్టుకుని.. శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. విశాల్ ప్రస్తుతం ప్రస్తుతం ‘లాఠీ’, తుప్పరివాళన్ 2, మార్క్ ఆంటోని వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Updated Date - 2022-09-28T18:00:54+05:30 IST