Mirror concert: షో చేస్తుండగా ఊడిపడిన ఎల్‌ఈడీ స్క్రీన్.. ఇద్దరూ డ్యాన్సర్స్ పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2022-07-29T19:27:37+05:30 IST

హాంకాంగ్‌లో గురువారం (జులై 28) రాత్రి కాంటోపాప్ బ్యాండ్ మిర్రర్ ప్రదర్శన ఇచ్చింది. ఈ షో చివరికి వస్తున్న తరుణంలో..

Mirror concert: షో చేస్తుండగా ఊడిపడిన ఎల్‌ఈడీ స్క్రీన్.. ఇద్దరూ డ్యాన్సర్స్ పరిస్థితి విషమం

హాంకాంగ్‌(Hong Kong)లో గురువారం (జులై 28) రాత్రి కాంటోపాప్ బ్యాండ్ మిర్రర్ (Mirror) ప్రదర్శన ఇచ్చింది. ఈ షో చివరికి వస్తున్న తరుణంలో సడెన్‌గా పైన ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్ ఊడి షో చేస్తున్నవారిపై పడింది. దీంతో ఇద్దరూ ఫర్పామర్స్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో.. మిర్రర్ సభ్యులు అన్సన్ లో, ఎడాన్ లూయి మరో డజను మంది డ్యాన్సర్‌లతో కలిసి ప్రదర్శన చేస్తున్నారు. అప్పుడే అనుకోకుండా ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఒకటి వేదికపై కూలిపోయింది. ఇది చూసిన ప్రేక్షకులు భయంతో కేకలు వేశారు. ఆ బరువైన స్క్రీన్ సరాసరి ఇద్దరిపై పడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాకుండా.. ముగ్గురు ప్రేక్షకులకు కూడా గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. ఒకరికి గాయాలు కాగా.. మరో ఇద్దరు షాక్ స్థితిలో ఉన్నారని.. అయితే వారికి వైద్య చికిత్స అవసరం లేదని పోలీసులు పేర్కొన్నారు. హాంకాంగ్ కొలీజియంలో ఈ కార్యక్రమంలో మొత్తం 12 షోలు జరగాల్సి ఉండగా.. నాలుగో షోతోనే కన్‌సర్ట్‌ని ఆపేయాల్సి వచ్చింది.



Updated Date - 2022-07-29T19:27:37+05:30 IST