PRIYANKA పేరు చెప్పి KANGANA ను టార్గెట్ చేయబోయి... తానే బుక్కైన నటి!

ABN , First Publish Date - 2021-11-16T22:34:41+05:30 IST

కంగనా రనౌత్‌కి పద్మాశ్రీ వచ్చాక చాలా మందికి వర్క్‌లోడ్ ఎక్కువైపోయింది. కొందరు సొషల్ మీడియాలో ఆమెని సపోర్ట్ చేస్తూ కష్టపడుతుంటే... మరికొందరు విమర్శిస్తూ ప్రతాపం చూపిస్తున్నారు...

PRIYANKA పేరు చెప్పి KANGANA ను టార్గెట్ చేయబోయి... తానే బుక్కైన నటి!

కంగనా రనౌత్‌కి పద్మాశ్రీ వచ్చాక చాలా మందికి వర్క్‌లోడ్ ఎక్కువైపోయింది. కొందరు సొషల్ మీడియాలో ఆమెని సపోర్ట్ చేస్తూ కష్టపడుతుంటే... మరికొందరు విమర్శిస్తూ ప్రతాపం చూపిస్తున్నారు. పైగా కంగనా ఈ మధ్య దేశ స్వాతంత్ర్యం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరింత అగ్గి రాజేసింది. 1947లో మనకు దక్కింది స్వాతంత్ర్యం కాదు ‘భిక్ష’ అంటూ ఆమె మాట్లాడటం, 2014లో అసలైన ఫ్రీడమ్ లభించిందని కామెంట్ చేయటం ... మోదీ వ్యతిరేకులకి ఎంత మాత్రం రుచించటం లేదు. రోజుకొకరు కంగనాపై విరుచుకుపడుతున్నారు. వారికి తనదైన రీతిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జవాబులు ఇస్తోంది కూడా. అయితే, తాజాగా ఓ టీవీ ఆర్టిస్ట్ కంగనాను క్రిటిసైజ్ చేసే తొందర్లో కాస్త అత్యుత్సాహం చూపి నెటిజన్స్ చేత తలంటించుకుంది..


హిందీ సీరియల్స్‌లో కనిపించే కవితా కౌశిక్ సొషల్ మీడియాలోనూ బాగా పాప్యులర్. అయితే, ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్న ఆమె ఇప్పుడు ప్రియాంక చోప్రా ఫోటో ఒకటి షేర్ చేసింది. పక్కనే తన మనోభావాన్ని కూడా రాసింది. ‘‘ఈమెకు ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదు? అద్భుతమైన నటి... అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయం సాధించింది... అలాగే, తను ఎప్పుడూ ఏ సీనియర్‌ని కానీ, తనతోటి నటీనటుల్ని కానీ అవమానించలేదు’’ అంటూ ప్రియాంకని పొగడ్తలతో ముంచెత్తింది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే... ప్రియాంక చోప్రాకి 2016లోనే పద్మశ్రీ లభించింది. ఆ విషయం తెలియకుండానే కవితా కౌశిక్ సొషల్ మీడియాలో తన అభిప్రాయం బయటపెట్టేసింది. మరి నెటిజన్స్ ఏం చేస్తారు? అటు ప్రియాంక, ఇటు కంగనాను వదిలేసి కవితా కౌశిక్‌ని బాగా ట్రోల్ చేశారు... 

Updated Date - 2021-11-16T22:34:41+05:30 IST