METOO Movement: పురుషులు కూడా బయటికొచ్చి మాట్లాడాలి

ABN , First Publish Date - 2022-02-05T02:20:49+05:30 IST

హిందీ సిరీయల్ ‘యె హై మొహబ్బతే’ లో నటించి ప్రేక్షకులకు సుపరిచితురాలైన సౌందర్య రాశి దివ్యాంక త్రిపాఠీ

METOO Movement: పురుషులు కూడా బయటికొచ్చి మాట్లాడాలి

హిందీ సిరీయల్ ‘యె హై మొహబ్బతే’ లో నటించి ప్రేక్షకులకు సుపరిచితురాలైన సౌందర్య రాశి దివ్యాంక త్రిపాఠీ. కంగనా రనౌత్ తర్వాత బాలీవుడ్‌లో ఆ స్థాయిలో మాటలను తూటల్లా పేర్చే నటిగా ఆమెకు పేరుంది. తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని దివ్యాంక చెప్పింది. తన కెరీర్ నాశనం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారని పేర్కొంది. తాజాగా ఆమె ఆంద్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు మహిళలకు మాత్రమే ఎదరు కాలేదని, పురుషులు కూడా దాని బారిన పడ్డారని చెప్పింది. వారు కూడా ముందుకు వచ్చి చెప్పాలని ఆమె ఆశించింది.


‘‘నేను బయటికి వచ్చి మాట్లాడినప్పుడు నా భర్త భయపడతాడు. మంచి, చెడులను కొందరు గుర్తించలేరు. లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం కొంత మంది మహిళలకు తెలియదు. అందుకే నా లాంటి వారు బయటికి వచ్చి మాట్లాడాలి. నేను మాట్లాడకపోతే ఎవరు వచ్చి మాట్లాడతారు. నా జీవితంలో అనేక ఎత్తు, పల్లాలు ఉన్నాయి. పలు ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాను. సినీ ఇండస్ట్రీలో వచ్చాక కూడా వాటితో పోరాటం చేశాను. మీటూ మూవ్‌మెంట్‌తో మంచే జరిగింది. ఇప్పుడు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించాలంటే భయపడుతున్నారు. కొంత మంది మీటూను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు’’ అని దివ్యాంక త్రిపాఠీ చెప్పింది.



Updated Date - 2022-02-05T02:20:49+05:30 IST