మహేశ్‌ కోసం.. ఆగమనం

ABN , First Publish Date - 2022-12-10T06:07:31+05:30 IST

మహేశ్‌ బాబు - పూజా హెగ్డే... ‘మహర్షి’లో అలరించిన జంట ఇది. మరోసారి వీరిద్దరూ వెండి తెరపై తళుక్కుమనబోతున్నారు.

మహేశ్‌ కోసం.. ఆగమనం

మహేశ్‌ బాబు - పూజా హెగ్డే... ‘మహర్షి’లో అలరించిన జంట ఇది. మరోసారి వీరిద్దరూ వెండి తెరపై తళుక్కుమనబోతున్నారు. మహేశ్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈనెల  15 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే కూడా పాలుపంచుకోనుంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో సంగీత చర్చలు జరిగాయి. త్రివిక్రమ్‌ - తమన్‌ అంటేనే సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కాంబోలో సూపర్‌ హిట్‌ పాటలెన్నో వచ్చాయి. మరోసారి.. వీరి నుంచి మంచి ఆల్బమ్‌ రాబోతోందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తరవాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న సినిమా ఇది. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్‌ ఓ చక్కటి కథ సిద్ధం చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. 

Updated Date - 2022-12-10T06:07:31+05:30 IST