టాలీవుడ్‌లో విషాదం.. నటి Meena భర్త మృతి..

ABN , First Publish Date - 2022-06-29T14:05:46+05:30 IST

చిత్ర పరిశ్రమలోని సినీ తారలకు, అభిమానులకు బుధవారం ఉదయం ఊహించని షాకింగ్ న్యూస్ ఇది. కరోనా వేరియంట్ ప్రభావం నటి మీనా (Meena) కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

టాలీవుడ్‌లో విషాదం.. నటి Meena భర్త మృతి..

చిత్ర పరిశ్రమలోని సినీ తారలకు, అభిమానులకు బుధవారం ఉదయం ఊహించని షాకింగ్ న్యూస్ ఇది. కరోనా వేరియంట్ ప్రభావం నటి మీనా (Meena) కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ (Vidyasagar) (48) మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఇప్పుడు ఈ వార్త చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. మీనా, విద్యాసాగర్ 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నైనిక అనే కుమార్తె ఉంది. 


నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా దళపతి విజయ్ హీరోగా వచ్చిన 'తేరి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యాసాగర్ మృతికి పలు రకాలుగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. "2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి కరోనా" అంటూ జనవరిలో మీనా సోషల్ మీడియా పోస్ట్ కూడా చేశారు. కోవిడ్ నుంచి మీనా, నైనిక కోలుకున్నారు. కానీ, విద్యా సాగర్‌కు పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయన శ్వాస వ్యవస్థ బాగా దెబ్బ తిన్నదని సమాచారం. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ కారణంగానే ఆయన ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. 


మీనా ప్రస్తుతం ఎస్ వి కృష్ణా రెడ్డీ దర్శకత్వంలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ సరసన. రెండు రోజుల క్రితమే భర్తకి బాగోలేదని తెలియడంతో  షూటింగ్ కాన్సిల్ చేసుకుని చెన్నై వెళ్లారు. కృష్ణా రెడ్డి చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ సరసన మొదట ఖుష్బూని ఎంపిక చేశారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగింది కూడా. తర్వాత ఆమె స్థానంలోకి మీనా వచ్చారు. హీరోయిన్ తల్లి వేషం ఇది.

Updated Date - 2022-06-29T14:05:46+05:30 IST