ఏపీ సీఎంతో 10న టాలీవుడ్ కీలక సమావేశం.. ఈసారి ఎవరెవరు వెళుతున్నారంటే?
ABN , First Publish Date - 2022-02-09T00:42:53+05:30 IST
ఏపీలో టాలీవుడ్కి ఉన్న సమస్యలను వివరించేందుకు ఇటీవల సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంపై రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఫైనల్గా ఇండస్ట్రీ సమస్యలను వివరించేందుకే జగన్ని
ఏపీలో టాలీవుడ్కి ఉన్న సమస్యలను వివరించేందుకు ఇటీవల సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంపై రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఫైనల్గా ఇండస్ట్రీ సమస్యలను వివరించేందుకే జగన్ని కలిసినట్లుగా చిరు వివరణ ఇచ్చారు. జగన్ని కలిసిన రోజే చిరంజీవి మరోసారి సమావేశం అవుతామని ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి 10వ తేదీన టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరిపేందుకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈసారి ఇండస్ట్రీ ప్రముఖులందరితో చర్చించి.. సమస్యలను మరింత క్షుణ్ణంగా జగన్కి చేరవేస్తానని చిరంజీవి చెప్పి ఉండటంతో.. ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 10న జరిగే సమావేశం తర్వాత దాదాపు సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ని ఎవరెవరు కలవబోతున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
మాములుగా అయితే ఈరోజే (ఫిబ్రవరి 08) ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ టాలీవుడ్లోని కొందరు సానుకూలంగా స్పందించకపోవడంతో.. ఈ సమావేశం 10కి వాయిదా పడిందని సమాచారం. అయితే ఈసారి చిరు వెంట ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల నిర్మాతలు, నాగార్జున, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కొందరు కలిసి.. మొత్తంగా 10 మంది సీఎం జగన్తో సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో స్టార్ హీరోలు మహేష్ బాబు, తారక్, ప్రభాస్ వంటివారు చిరుకి మద్దతు తెలుపుతూ.. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరినట్లుగా టాక్ నడుస్తోంది.