సీక్వెల్స్ సందడి షురూ!
ABN , First Publish Date - 2022-01-17T22:43:52+05:30 IST
కరోనా మరోసారి విజృంభించడం సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. విడుదల ప్రకటించిన చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినవే కావడం, దేశవ్యాప్తంగా విడుదల కావలసిన ముఖ్యమైన ఏరియాల్లో కర్య్ఫూ అమలులో ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం కారణంగా ఈ చిత్రాలన్ని వెనకడుగు వేశాయి. అయితే మంచి రోజులు ముందున్నాయి అనే నమ్మకంతో మేకర్స్ ఒకడుగు వెనక్కి వేసినా.. పరిస్థితులు చక్కబడ్డాక మంచి సమయం చూసి తమ చిత్రాలు విడుదల చేయవచ్చనే ఆశాభావంతో ఉన్నారు.
వెంకటేశ్, వరుణ్ తేజ్ కో–బ్రదర్స్గా నటించి నవ్వులు పూయించిన చిత్రం ‘ఎఫ్–2’. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సూపర్హిట్ టాక్తో దూసుకెళ్లింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘ఎఫ్–3’ తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25న ‘ఎఫ్–3’ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. తమన్నా, మెహరీన్ ఇందులో కథానాయికలు.
విశ్వక్సేన్ నటించగా బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ‘హిట్’ చిత్రానికి సీక్వెల్గా ‘హిట్ –2’ రానుంది. అయితే ఈ చిత్రంలో అడివి శేష్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్నారు.
అడవి శేష్ హీరోగా సూపర్ హిట్టైన స్పై థ్రిల్ల్లర్ ‘గూఢాచారి’. 2018లో విజయం అందుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్గా ‘గూఢాచారి 2’ రాబోతోంది. ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంతో బిజీగా ఉన్న శేష్ ‘గూఢచారి2’ను ఈ ఏడాదే విడుదల చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.