Tollywood: మరోసారి జతకడుతున్న హీరోహీరోయిన్లు..

ABN , First Publish Date - 2022-06-28T18:42:22+05:30 IST

మన తెలుగులోనే కాక మిగతాభాషలలోనూ సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన జంటలు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఎన్.టి.ఆర్ (NTR)- సావిత్రి (Savithri), ఏ.ఎన్.ఆర్ (ANR)- సావిత్రిలది హిట్ పెయిర్.

Tollywood: మరోసారి జతకడుతున్న హీరోహీరోయిన్లు..

మన తెలుగులోనే కాక మిగతాభాషలలోనూ సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన జంటలు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఎన్.టి.ఆర్ (NTR)- సావిత్రి (Savithri), ఏ.ఎన్.ఆర్ (ANR)- సావిత్రిలది హిట్ పెయిర్. చిరంజీవి (Chiranjeevi)తో.. రాధ, విజయశాంతి, మాధవి, రాధిక, సుహాసిని, సుమలత, భానుప్రియ లాంటి హీరోయిన్స్ వరుస సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. వీరందూ చిరంజీవికి హిట్ పేయిర్. ఇదే హీరోయిన్స్ బాలకృష్ణ, వెంకటేశ్, శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు.


ఈ జంటలతో సినిమా చేయాలనే ఉత్సాహం అప్పట్లో దర్శకనిర్మాతలకు చాలా ఉండేది. ఇక ఇప్పుడు కూడా కొన్ని జంటలు ఇలాగే రిపీట్ అవుతున్నాయి. ఇప్పటికే వీరి కలయికలో సినిమాలు వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇదే జంట త్వరలో మరో సినిమాతో వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నాయి. ఆ జంటలేవో ఓ సారి చూద్దాం.


సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి ఇంతకముందు 'మహర్షి' సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాదు, అవార్డులు దక్కించుకుంది. వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. ఇప్పుడు మహేశ్ - పూజా కలిసి మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించబోతుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.


మెగ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani) కలిసి ఇంతకముందు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వినయ విధేయరామ అనే సినిమాను చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేపోయింది. ఇప్పుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో మళ్ళీ చరణ్, కియారా జోడీ కలిసి అలరించబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య (Naga Chaithanya), రాశీ ఖన్నా (Rasi Khanna) కలిసి ఇంతకముందు 'వెంకీ మామా' సినిమాలో నటించారు. మళ్ళీ ఇప్పుడు థాంక్యూ సినిమాతో రాబోతున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. 


నేచురల్ స్టార్ నాని (Nani), కీర్తి సురేష్ (Keerthi Suresh) కలిసి 'నేను లోకల్' సినిమాలో నటించి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే జంట మళ్ళీ 'దసరా' అనే పాన్ ఇండియాలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరక్కిస్తునారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) కలిసి నటించారు. ఇప్పుడు ఇదే జంట శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తోంది. ఇక లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్'  (Bhola Shankar) సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ ఇందులో చిరుకి చెల్లిగా నటిస్తోంది. మెగాస్టార్ ఇంతకముందు నటించిన 'సైరా' సినిమాలో తమన్నా (Tamannah) ఆయనకు జంటగా నటించి ఆకట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు 'భోళా శంకర్‌'తో మెగాస్టార్ సరసన అలరించడానికి రెడీ రెడీ అవుతోంది తమన్నా. మరి ఈ జంటలు నటిస్తున్న కొత్త చిత్రాలు విడుదలయ్యాక ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి. 

Updated Date - 2022-06-28T18:42:22+05:30 IST