Director Madan: ‘పెళ్లైన కొత్తలో’ దర్శకుడు ఇకలేరు

ABN , First Publish Date - 2022-11-20T15:17:51+05:30 IST

‘ఆ నలుగురు’ (Aa naluguru)చిత్రంతో రచయిత (writer)గా తన ప్రతిభను నిరూపించుకుని.. ‘పెళ్లయిన కొత్తలో’(Pellaina kotthalo) చిత్రంతో..

Director Madan: ‘పెళ్లైన కొత్తలో’ దర్శకుడు ఇకలేరు

‘ఆ నలుగురు’ (Aa naluguru)చిత్రంతో రచయిత (writer)గా తన ప్రతిభను నిరూపించుకుని.. ‘పెళ్లయిన కొత్తలో’(Pellaina kotthalo) చిత్రంతో దర్శకుడిగా మారిన మదన్ (Madan passed away)కన్ను మూశారు.  నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడే అప్పటిన నుంచి చికిత్స పొందుతూ ఆదివారం (నవంబర్ 20) ఉదయం 1.14 గంటలకు తుది శ్వాస విడిచారు. మదనపల్లికి చెందిన ‘మదన్ గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్ మై వైఫ్’, ‘గరం’, ‘గాయత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా.. సన్నిహితులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం దర్శకుడు మదన్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహప్రస్థానంలో ఉంచుతారు. 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు.

Updated Date - 2022-11-20T15:17:51+05:30 IST