‘యానిమల్’ ప్రపంచంలోకి రష్మిక
ABN , First Publish Date - 2022-04-02T22:57:09+05:30 IST
బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక మందన్న
బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ వంటి హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె నటించిన హిందీ మూవీస్ విడుదల కాకముందే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లీగా అభిమానులను అలరించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని చిత్రాల్లో ఆమె అవకాశాలు దక్కించుకుంటుంది.
రష్మిక మందన్న తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా నటించనుంది. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక కథానాయికగా అలరించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ‘యానిమల్’ను టీ-సిరీస్ రూపొందిస్తుంది. ఉగాదిని పురస్కరించుకుని ఆ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఉగాది సందర్భంగా ‘యానిమల్’ బృందంలోకి రష్మిక మందన్నకు స్వాగతం. ఈ ఏడాది వేసవిలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని టీ-సిరీస్ ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ‘యానిమల్’ ప్రపంచంలోకి రష్మిక మందన్నకు సుస్వాగతం. ఈ చిత్రంలో గీతాంజలి అనే పాత్రలో ఆమె కనిపించనుంది’’ అని అతడు తెలిపాడు.
‘యానిమల్’ లో తొలుత పరిణీతి చోప్రా కథానాయికగా ఎంపికయింది. కానీ, ఇంతియాజ్ అలీ చిత్రంలో అవకాశం రావడంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది.