‘ఈద్’ రోజున వస్తామంటున్న టైగర్, జోయా

ABN , First Publish Date - 2022-03-04T22:45:38+05:30 IST

టాలీవుడ్ టు బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే హిట్

‘ఈద్’ రోజున వస్తామంటున్న టైగర్, జోయా

టాలీవుడ్ టు బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే హిట్ మూవీస్ సీక్వెల్స్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటాయి. ‘గోల్ మాల్’, ‘సింగం’ మూవీస్ ఇలా అభిమానుల ఆదరణ పొందినవే. ‘టైగర్’ చిత్రాలు సంచలన విజయం సాధించడంతో తాజాగా మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘టైగర్-3’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. టైగర్, జోయా పాత్రల్లో వీరు కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసింది. ‘‘టైగర్, జోయా 2023, ‘ఈద్’ రోజున థియేటర్లకి వస్తున్నారు’’ అని కత్రినా రాసింది. ఈ చిత్రాన్ని 2023, ఏప్రిల్ 21న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. 


‘టైగర్-3’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రతి ఏడాది రంజాన్‌కు సినిమాను విడుదల చేయడం సల్మాన్ అలవాటు. ఈ బాటలోనే పయనిస్తూ ‘టైగర్-3’ ని కూడా ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మనీశ్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో సల్మాన్, కత్రినా కలసి అనేక సినిమాల్లో నటించారు. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘పార్ట్‌నర్’, ‘భారత్’ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.  



Updated Date - 2022-03-04T22:45:38+05:30 IST