Salman Khanకు బెదిరింపు లేఖపై దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-06-10T12:54:41+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు....

Salman Khanకు బెదిరింపు లేఖపై దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు

 Salman Khanకు బెదిరింపు లేఖ...లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే

ముంబై పోలీసుల విచారణలో వెల్లడి

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు.నటుడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు లేఖను అందించిన వ్యక్తులను ముంబై పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితుడు సిద్ధేష్ హిరామన్ కాంబ్లే అలియాస్ మహాకల్‌ను విచారించిన సందర్భంగా ఈ విషయం వెల్లడైంది.ముంబై పోలీసుల కథనం ప్రకారం, బిష్ణోయ్ సహాయకుడు విక్రమ్ బరాద్ లేఖను సలీంఖాన్‌కు ఇచ్చినట్లు నిందితుడు మహకల్ వెల్లడించాడు.


‘‘జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ లేఖను సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌కు ఇచ్చాడు. అతని ముఠాలోని ముగ్గురు వ్యక్తులు లేఖను ఇవ్వడానికి రాజస్థాన్‌లోని జలోర్ నుంచి ముంబైకి వచ్చి నిందితుడు సౌరభ్ మహాకల్‌ను కలిశారని ముంబై పోలీసులు తెలిపారు.ఈ లేఖను అందించిన వ్యక్తులను క్రైమ్ బ్రాంచ్ గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.‘‘ లేఖ ఇచ్చిన వారి  ఆధారాలు ఉన్నాయి.. వారిని త్వరలోనే అరెస్టు చేసేందుకు 6 బృందాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించాం’’ అని ముంబై పోలీసులు తెలిపారు.


ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు బుధవారం వెల్లడించారు. పంజాబ్‌లో గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన షూటర్‌కు అత్యంత సన్నిహితుడు సిద్ధేష్ హిరామన్ కమ్లేను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-06-10T12:54:41+05:30 IST