సూర్య, శృతిహాసన్ కాదు.. రమ్యకృష్ణ ఫైనల్
ABN , First Publish Date - 2021-11-27T01:07:20+05:30 IST
శృతిహాసన్తో పాటు హీరో సూర్య, సినీ నటి రమ్యకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీరితో పాటు శింబు, విజయ్ సేతుపతి పేర్లు కూడా వినిపించాయి. శృతిహాసన్ అయితే దాదాపు కన్ఫర్మ్ అనేలా వార్తలు వైరల్ అవుతున్న
విశ్వనటుడు కమల్హాసన్కు కరోనా వైరస్ సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన హోస్ట్గా ప్రసారమయ్యే రియాల్టీ షో ‘బిగ్బాస్’ సీజన్ 5 తమిళ కార్యక్రమానికి ఇపుడు తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాతను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్హాసన్ స్థానంలో ఎవరు హోస్ట్గా ఎవరు వస్తారనే చర్చ కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రియాల్టీ షోకు హోస్ట్గా ఆయన పెద్ద కుమార్తె శృతిహాసన్తో పాటు హీరో సూర్య, సినీ నటి రమ్యకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీరితో పాటు శింబు, విజయ్ సేతుపతి పేర్లు కూడా వినిపించాయి. శృతిహాసన్ అయితే దాదాపు కన్ఫర్మ్ అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు గెస్ట్ హోస్ట్గా వచ్చేది రమ్యకృష్ణే అంటూ వార్త బయటికి వచ్చింది.
‘బిగ్బాస్’ ప్రసారం అవుతున్న ఛానల్లో రమ్యకృష్ణ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేసుండటంతో పాటు, నాగ్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్బాస్లో ఓసారి గెస్ట్ హోస్ట్గా ఆమె సక్సెస్ఫుల్గా బాధ్యతలు నిర్వహించి ఉండటంతో.. బిగ్బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఆమె కూడా ఈ వీకెండ్ షోకి గెస్ట్ హోస్ట్గా వచ్చేందుకు సుముఖత తెలిపారని, వచ్చేది రమ్యకృష్ణే.. ఇది ఫైనల్ అంటూ తాజాగా కోలీవుడ్లో టాక్ మొదలైంది. కొత్తవారైతే ఇబ్బంది పడతారేమో కానీ, గెస్ట్ హోస్ట్ అనుభవం ఉన్న రమ్యకృష్ణకు ఈ వీకెండ్ షోని రక్తికట్టించడం పెద్ద కష్టమేమీ కాదు.. అందుకే బిగ్బాస్ నిర్వాహకులు కూడా ఆమె వైపే మొగ్గు చూపి ఉండవచ్చు. రమ్య ప్రెజన్స్తో ఈ వీకెండ్ తమిళ బిగ్బాస్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు మరి.