ఇది పెయిడ్‌ బ్యాచ్‌ పని

ABN , First Publish Date - 2022-09-30T11:54:44+05:30 IST

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. పాయల్‌ రాజ్‌పుత్‌ , సన్నీలియోన్‌ కథానాయికలు. ఈశాన్‌ సూర్య హెల్మ్‌ దర్శకుడు..

ఇది పెయిడ్‌ బ్యాచ్‌ పని

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. పాయల్‌ రాజ్‌పుత్‌ , సన్నీలియోన్‌ కథానాయికలు. ఈశాన్‌ సూర్య హెల్మ్‌ దర్శకుడు. అవా ఎంటర్టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. గురువారం విష్ణు ‘జిన్నా’ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘అక్టోబరు 5న ‘జిన్నా’ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నాం. 21న సినిమాను విడుదల చేస్తున్నాం. ‘జిన్నా’ నాకు చాలా ప్రత్యేకం. మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనుకుంటున్నాం’ అన్నారు. తమ కుటుంబంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి స్పందిస్తూ ‘రెండు ఐపీ అడ్ర్‌సల నుంచి ట్రోల్‌ వీడియోలు పోస్ట్‌ అవుతున్నట్లు  సైబర్‌ పోలీసులు గుర్తించారు. జూబ్లిహిల్స్‌, చెక్‌పోస్టు దగ్గర ఉన్న రెండు ఆఫీసుల నుంచి ఇవి అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఇదంతా ఒక పెయిడ్‌ బ్యాచ్‌ పని. ‘మా’ ఎన్నికల నుంచే ఇవి మొదలయ్యాయి.  అందుకే కోర్టుకు వెళుతున్నాం’ అని తెలిపారు.   


Updated Date - 2022-09-30T11:54:44+05:30 IST