బ్లాక్బస్టర్ మూవీ ‘పుష్ప’ను చేజార్చుకున్న సెలెబ్రిటీల లిస్ట్ ఇదే
ABN , First Publish Date - 2022-01-28T21:21:18+05:30 IST
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అనేక
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. కారణమేదైనా కానీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీని పలువురు తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తొలుత ఈ సినిమాకు అల్లు అర్జున్, రష్మిక మందన్నను హీరోహీరోయిన్లుగా అనుకోలేదట. కాగా.. ఎవరిని ఉద్దేశించి ఈ సినిమాను తీయాలని భావించారు? బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ‘పుష్ప’ను మిస్ చేసుకున్న సెలెబ్రిటీలు ఎవరు? అనే వివరాలపై ఓ లుక్కేద్దామా మరి..
మహేశ్ బాబు:
సుకుమార్ ఈ కథను మొదటగా మహేశ్ బాబుకు వినిపించాడు. అతడికి స్క్రిఫ్ట్ కూడా నచ్చింది. అయితే సృజనాత్మక విభేదాల వల్ల ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం లెక్కల మాస్టారు బన్నీకి స్టోరీ వినిపించాడు. స్టైలిష్ స్టార్కు నచ్చడంతో.. సినిమా చేసేందుకు వెంటనే ఓకే చెప్పేశాడు.
సమంత:
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రష్మికకు బదులుగా చిత్రబృందం మొదట సమంతను సంప్రదించింది. కానీ, అనుకోని కారణాల సమంత ఈ సినిమా చేయలేకపోయింది. తర్వాత స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమె వద్దకు వెళ్లింది. అయితే.. తొలుత స్పెషల్ సాంగ్ చేయడానికి నిరాకరించిన సమంత.. చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
విజయ్ సేతుపతి:
ఈ మూవీలో జాలిరెడ్డి పాత్రకు నిర్మాతలు మొదటగా విజయ్ సేతుపతిని సంప్రదించారు. డేట్స్ సర్దుబాటు కాకపోడంతో అతడు ఈ సినిమాలో నటించలేకపోయాడు. తర్వాత ఆ పాత్ర కోసం ధనంజయను కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో జాలిరెడ్డి రోల్ చేసేందుకు అతడు అంగీకరించాడు.
దిశా పటానీ:
‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ లిస్ట్లో మొదటి స్థానం పొందింది. మొదట ఈ స్పెషల్ పాట కోసం చిత్ర బృందం దిశా పటానీని అడిగింది. కారణమేదైనా కానీ ఆమె మాత్రం.. ఈ పాట చేసేందుకు అంగీకరించలేదు.
నోరా ఫతేహీ:
బాహూబలిలో మనోహరి పాటలో నటించి.. కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది నోరా ఫతేహీ. ‘ఊ అంటావా’ పాట చేయమని నిర్మాతలు ఆమెని కూడా సంప్రదించారట. ఆమె భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు కంగుతిన్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ పాటను ఆమె చేయలేకపోయింది.