కత్రినా కైఫ్ నుంచి ఐశ్వర్యారాయ్ వరకు.. పెళ్లిలో ఏఏ హీరోయిన్ ఎంత ఖరీదైన బంగారు ఆభరణాలను ధరించారంటే..

ABN , First Publish Date - 2021-12-17T00:50:20+05:30 IST

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బాలీవుడ్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్‌లో

కత్రినా కైఫ్ నుంచి ఐశ్వర్యారాయ్ వరకు.. పెళ్లిలో ఏఏ హీరోయిన్ ఎంత ఖరీదైన బంగారు ఆభరణాలను ధరించారంటే..

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బాలీవుడ్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో  వీరు పెళ్లి పీటలను‌ ఎక్కారు. సబ్యసాచి డిజైన్ చేసిన లెహంగాను కత్రినా తన పెళ్లిలో ధరించింది. ఈ లెహంగా ధర రూ.17లక్షలు అని తెలుస్తోంది. పెళ్లిలో ఆమె ధరించిన డైమండ్ రింగ్ ధర రూ.7లక్షల 40వేలు అని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తారలు తమ పెళ్లిలో ధరించిన బంగారు ఆభరణాలపై ఓ లుక్కేద్దామా..


ఐశ్వర్యారాయ్ :

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ పెళ్లి బీ టౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పెళ్లి గురించి అప్పట్లో అనేక మంది చర్చించుకున్నారు. బంగారు తీగలతో తయారు చేసిన రూ.75లక్షల విలువ జేసే శారీని ఆమె ధరించింది. పెళ్లి సమయంలో ఆమె ధరించిన బంగారు ఆభరణాల విలువ దాదాపు రూ.3.5కోట్లు అని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొట్టాయి. 


అనుష్క శర్మ:

భారత్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లిని అనుష్క శర్మ 2017లో ఇటలీలో పెళ్లి చేసుకుంది. సబ్యసాచి డిజైన్ చేసిన రూ.45లక్షల విలువ జేసే లెహంగాను ఆమె పెళ్లిలో ధరించింది. రూ. 3కోట్ల విలువజేసే బంగారు నగలను ఆమె వేసుకుంది. 


ప్రియాంక చోప్రా :

ఇంటర్నేషనల్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రియాంక చోప్రా ఉమైద్ ప్యాలెస్ బిల్డింగ్‌లో వివాహమాడింది. ఈ జంట 2018లో ఒక్కటయ్యారు. సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ లెహంగాను పెళ్లిలో ఆమె ధరించింది. రూ.3 నుంచి 4 కోట్ల విలువజేసే బంగారు ఆభరణాలను వివాహ సమయంలో ఆమె వేసుకుంది.   


దీపికా పదుకొణె : 

బాలీవుడ్ నటుడైన రణ్ వీర్ సింగ్‌ను ఇటలీలో దీపికా పదుకొణె వివాహమాడింది. దీపిక రూ.20లక్షల విలువ జేసే మంగళ సూత్రాన్ని పెళ్లి రోజున ధరించింది. దాదాపుగా రూ.1.5కోట్ల విలువ చేసే బంగారు నగలను పెళ్లి సమయంలో ఆమె వేసుకుంది. 


శిల్పా శెట్టి : 

బిజినేస్ మేన్ అయిన రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్‌లో జరిగిన ఖరీదైన పెళ్లిలో ఇది కూడా ఒకటి. పెళ్లి రోజున ఆమె ధరించే లెహంగాను తరుణ్ తహిల్యాని డిజైన్ చేశారు. ఈ లెహంగా ఖరీదు దాదాపుగా రూ.50లక్షలు అని తెలుస్తోంది. నిశ్చాతార్థం సమయంలో ఆమె ధరించిన రింగ్ కూడా వార్తల్లో కెక్కింది.  ఆ రింగ్ ధర రూ. 5కోట్లు అని బీ టౌన్ లో గుసగుసలు వినిపించాయి. పెళ్లి రోజున ఆమె ధరించిన బంగారు నగల ధర రూ. కోటి రూపాయాలు అని తెలుస్తోంది.

Updated Date - 2021-12-17T00:50:20+05:30 IST