ఊహించని ట్విస్ట్ ఆకట్టుకుంటుంది
ABN , First Publish Date - 2022-07-06T05:53:53+05:30 IST
సందీప్ మాధవ్, గాయత్రీ ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. అప్సర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించారు...
సందీప్ మాధవ్, గాయత్రీ ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. అప్సర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించారు. సీనియర్ నటుడు సాయికుమార్ రాజకీయనాయకుడిగా కీలకపాత్రలో నటించారు. ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ
అప్సర్ చెప్పిన కథలో కొత్తదనం కనిపించింది. కథపై నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ‘గంధర్వ’లో నటీనటులు కొత్తవాళ్లు అయినా కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చనిపోయాడు అనుకుంటున్న తండ్రి యువకుడిగా తిరిగి వస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ పాయింట్ను దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎవరూ ఊహించని ట్విస్ట్ నా పాత్రలో ఉంటుంది.
నేను ‘పోలీస్ స్టోరీ’ చేసి 25 ఏళ్లు అయింది. కమల్హాసన్ ‘విక్రమ్’ ఇచ్చిన స్ఫూర్తితో ‘పోలీస్ స్టోరీ’కి సీక్వెల్ చేయబోతున్నాం. వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్తుంది.
బాల నటుడిగా తొలిసారి నాటకం కోసం మేకప్ వేసుకొని ఇప్పటికి 50 ఏళ్లయింది. ప్రస్తుతం 15 చిత్రాల్లో నటిస్తున్నాను. ధనుష్ చిత్రం ‘సర్’లో నాది నెగెటివ్ రోల్. అలాగే ‘దసరా’లో నా పాత్ర ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉంటుంది. తమిళంలో ‘డీజిల్’ అనే చిత్రం చేస్తున్నాను. ఇందులో మాఫియా లీడర్గా కనిపిస్తాను. మూడు గెట్పలు ఉంటాయి. ఓ వెబ్సిరీస్ అంగీకరించాను.