కథలో మలుపులు ఆకట్టుకుంటాయి
ABN , First Publish Date - 2022-08-18T12:42:58+05:30 IST
‘శుక్ర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు సుకు పూర్వజ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాటరాని మౌనమిది’....
‘శుక్ర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు సుకు పూర్వజ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాటరాని మౌనమిది’. మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోనీ శ్రీ వాస్తవ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా సుకు పూర్వజ్ మాట్లాడుతూ ‘హారర్, థ్రిల్లర్, ఫిక్షన్ కలబోతగా ఈ సినిమా రూపొందించాం. రెండు మేజర్ క్యారెక్టర్స్కు సంబాషణలు ఉండవు. కథలో ఐదారు మలుపులు ఉంటాయి. అవన్నీ ఒక శాస్త్రీయ అంశంతో ముడిపడి ఉంటాయి. నా తదుపరి చిత్రాల వివరాలు త్వరలో వెల్లడిస్తాను’ అన్నారు.