‘‘పెళ్లి తరువాత అంతా మారిపోతుందంటారు... నిజమేనా?’’ Kiara Advani అనుమానం!

ABN , First Publish Date - 2022-05-11T00:23:21+05:30 IST

ప్రతిష్ఠాత్మక ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ‘జుగ్ జుగ్ జీయో’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. మూవీలో నటించిన నీతూ కపూర్, అనీల్ కపూర్, వరుణ్ ధవన్ తమ, తమ పెళ్లినాటి ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేశారు. తద్వారా రాజ్ మెహతా దర్శకత్వం వహించిన తాజా ఎంటర్టైనర్ కి పబ్లిసిటీ కల్పించే పనిలో పడ్డారు...

‘‘పెళ్లి తరువాత అంతా మారిపోతుందంటారు... నిజమేనా?’’ Kiara Advani అనుమానం!

ప్రతిష్ఠాత్మక ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ‘జుగ్ జుగ్ జీయో’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. మూవీలో నటించిన నీతూ కపూర్, అనీల్ కపూర్, వరుణ్ ధవన్ తమ, తమ పెళ్లినాటి ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేశారు. తద్వారా రాజ్ మెహతా దర్శకత్వం వహించిన తాజా ఎంటర్టైనర్ కి పబ్లిసిటీ కల్పించే పనిలో పడ్డారు... 


‘జుగ్ జుగ్ జీయో’ సినిమాలో అందాల భామ కియారా కూడా నటించింది. ఆమె కూడా వెడ్డింగ్ ఫోటో షేర్ చేసింది. అయితే, ఇంకా పెళ్లి కానీ మన మిస్ అద్వాణీ పెరెంట్స్ వెడ్డింగ్ పిక్ నెటిజన్స్ తో పంచుకుంది. ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉంచింది జనాల ముందు... 


దివంగత బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ భార్య నీతూ కపూర్. ‘జుగ్ జుగ్ జీయో’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే, సినిమా ప్రచారంలో భాగంగా ఆమె తన అలనాటి పెళ్లి ఫోటో అభిమానులతో పంచుకుంది. ‘‘పెళ్లి తరువాత నాకు సంబంధించి అంతా మారిపోయింది. రిషీ జీ! మీ ఆశీస్సులతో నేను ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. నా హృదయంలో మీరెప్పుడూ ఉంటారు... ’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు నీతూ కపూర్! 


అనీల్ కపూర్ కూడా సునీతా కపూర్ తో తన పెళ్లి ఫోటోని జనం ముందుకు తెచ్చాడు. ‘‘మీరు మాకు ఒకసారి మీ దీవెనలు అందించారు... ఇప్పుడు నా ‘మరో’ కుటుంబం సరికొత్త ప్రయాణం ప్రారంభించబోతోన్న వేళ మీ ఆశీస్సులు కావాలి. ఎందుకంటే, పెళ్లి తరువాత మొత్తం అంతా మారిపోతుంది కాబట్టి... ’’ అంటూ ఆయన ఆసక్తికరంగా పోస్టు రాసుకొచ్చాడు.


ఇక ‘జుగ్ జుగ్ జీయో’లో హీరోగా నటిస్తోన్న వరుణ్ ధవన్ భార్య నటాషా దలాల్ తో ఏడు అడుగులు వేస్తోన్న అందమైన ఫోటో అభిమానులకు చూపించాడు. ‘‘మీరు ఇదే రోజు మాకు ఎంతో ప్రేమని పంచారు. అయితే, ఇప్పుడు నాకు మళ్లీ మీ అశీర్వచనాలు కావాలి. ఎందుకంటే, పెళ్లి తరువాత అంతా మారిపోతుంది కాబట్టి...’’ అన్నాడు మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా! 


అందాల రా‘కుమారి’... కియారా సైతం ‘జుగ్ జుగ్ జీయో’ సినిమా ప్రచారంలో భాగమైంది. ఆమెకి ఇంకా పెళ్లి కాకపోవటంతో అమ్మనాన్నల పెళ్లి ఫోటో సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పర్ఫెక్ట్ మ్యారేజ్’ అంటే తన దృష్టిలో వారిదేనంటోంది! అంతే కాదు, తన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తనకు ఎప్పుడూ ఉంటాయన్న మిస్ కియారా నెటిజన్స్ నుంచీ కూడా దీవెనలు కోరింది! పనిలో పనిగా సలహా ఇవ్వమని కూడా అభ్యర్థించింది. ‘‘పెళ్లి తరువాత అంతా మారిపోతుందట... నిజమేనంటారా?’’ అంటోంది గార్జియస్ గాడెస్... 


‘‘పెళ్లి తరువాత అంతా మారిపోతుంది’’ (క్యూంకీ షాదీ కే బాద్ సబ్ బదల్ జాతా హై!) అన్న ట్యాగ్ లైన్ తో జోరుగా ప్రచారం సాగుతోంది ‘జుగ్ జుగ్ జీయో’ కోసం. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 24న బాక్సాఫీస్ వద్ద విడుదల కానుంది. చూడాలి మరి, టీమ్ మొత్తం తమ పెళ్లి ఫోటోలతో సందడి చేస్తోన్న ధర్మా ప్రొడక్షన్స్ లెటెస్ట్ మూవీ చివరకు ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో... 

Updated Date - 2022-05-11T00:23:21+05:30 IST