Aryan Khan డ్రగ్స్ కేసులో Ananya Panday కు సమన్లు జారీ చేయడంపై ఎన్సీబీ అధికారి ఏం చెప్తున్నారంటే..
ABN , First Publish Date - 2021-10-21T21:10:02+05:30 IST
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ నివాసమైన మన్నత్తో పాటు అనన్య పాండే ఇళ్లపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అక్టోబర్ 21న దాడులు జరిపారు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ నివాసమైన మన్నత్తో పాటు అనన్య పాండే ఇళ్లపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అక్టోబర్ 21న దాడులు జరిపారు. అనన్య పాండేతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి చర్చించినట్టు వారు ప్రత్యేక కోర్టుకు గతంలోనే సాక్ష్యాలను సమర్పించారు. గురువారం మధ్యాహ్నం(అక్టోబర్ 21న) రెండు గంటల సమయంలో వారి ఇద్దరి ఇళ్లపై ఒకేసారి దాడులు జరిపారు.
అనన్య పాండే నివాసం వద్ద ఎన్సీబీ అధికారి మాట్లాడుతూ..‘‘ ప్రస్తుతం డ్రగ్స్కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. మేం దర్యాప్తు కోసం ఒకరి నివాసానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిందితుడని అర్థం కాదు. వారిపై దర్యాప్తు జరుగుతున్నట్టు భావించాల్సిన అవసరం లేదు. దర్యాప్తులో అనేక దశలుంటాయి ’’ అని చెప్పారు.
మన్నత్పై దాడులు జరపగానే హన్సల్ మెహతా ట్విటర్లో షారూఖ్కు తన మద్దతును తెలిపారు. ‘‘ స్టార్, సెలెబ్రిటీ, బాలీవుడ్కు చెందినంత మాత్రాన మీకు బావోద్వేగాలు ఉండబోవని అనుకోవడం సరికాదు. ఒక తండ్రిగా మీరు పడే బాధ ప్రజలకు తెలియదు. బెయిల్ను ఇవ్వకపోవడం అనేది ఘోరమైన తీర్పు ’’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ‘‘ స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ ’’ వెబ్ సిరీస్కు హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.