భూతం రెడీ!

ABN , First Publish Date - 2022-07-07T06:25:34+05:30 IST

ప్రభుదేవా నటించిన ‘మై డియర్‌ భూతం’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. వైవిధ్యభరితమైన కథతో కిడ్స్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గా ఇది రూపుదిద్దుకొంది...

భూతం రెడీ!

ప్రభుదేవా నటించిన ‘మై డియర్‌  భూతం’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. వైవిధ్యభరితమైన కథతో కిడ్స్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గా ఇది రూపుదిద్దుకొంది. ప్రభుదేవా పాత్రతో పాటు అడ్వెంచర్‌ సీన్లు, గ్రాఫిక్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర దర్శకుడు ఎన్‌.రాఘవన్‌ చెప్పారు. ఏ.ఎన్‌. బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ఈ ఫాంటసీ మూవీలో జీనీ పాత్రధారి ప్రభుదేవా, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలు అలరిస్తాయి. సినిమాలో మంచి సందేశం అందిస్తున్నాం. ప్రభు దేవా పాత్ర చుట్టూ తిరుగుతూ ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’ అని ఆయన తె లిపారు. సినిమా చూసి జీ నెట్‌వర్క్‌ టీమ్‌ భారీ ధర చెల్లించి ఓటీటీ హక్కులు కొన్నారని కూడా ఆయన చెప్పారు. రమ్య నంబీసన్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ తమిళ్‌ ఫేమ్‌ సంయుక్త , ఇమ్మాన్‌ అన్నాచి, సురేశ్‌ మీనన్‌, లొల్లు సభా, స్వామినాథన్‌ తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

Updated Date - 2022-07-07T06:25:34+05:30 IST