Krishnam Raju: వెండితెర రాజసం వెళ్లిపోయింది..
ABN , First Publish Date - 2022-09-12T03:08:06+05:30 IST
ఈరోజు (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున జామున 3.25 గంటలకు సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి
ఈరోజు (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున జామున 3.25 గంటలకు సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఉమర్జీ అనురాధ సంఘం తరఫున సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె.."గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, కోరుకుంటున్నారు అని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా కాలం చేసిన ప్రముఖ హీరో, నిర్మాత, వెండితెర రాజసం, మా తెలుగు సినీ రచయితల (Telugu Cine Writers community) సంఘం సభ్యులు కృష్ణంరాజుకి అశ్రునివాళి అర్పించారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని పేర్కొన్నారు.
అలాగే, తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ప్రెసిడెంట్ ఇన్చార్జ్ విజయేంద్ర ప్రసాద్ కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. అమెరికాలో ఉన్న రచయితల సంఘం అధ్యక్షులు, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు హఠాన్మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు అని తెలిపారు. తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు బుర్ర సాయి మాధవ్ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు రాజసం వెళ్లిపోయిందని చెప్పారు. కాగా, కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్లో జరుగుతాయి. ఉదయం 11:30 గంటలకు కృష్ణంరాజు నివాసం నుంచి ఆయన పార్థివదేహం బయలుదేరుతుంది.