అంచనాలు పెంచుతున్న ఆది

ABN , First Publish Date - 2022-08-10T05:41:34+05:30 IST

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.

అంచనాలు పెంచుతున్న ఆది

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ చిత్రం ఈ  నెల 19న విడుదల కానుంది. వ్యాపారవేత్త డాక్టర్‌ నాగం తిరుపతిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి  కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే  విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌ సినిమా మీద అంచనాలు పెంచాయి. తాజాగా రెండు నిముషాల 42 సెకన్ల నిడివితోటి కట్‌ చేసిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా అమ్మను తప్పుగా చూశారు.. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో సాయికుమార్‌ ఎంట్రీ చూపించారు. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్‌ ఎలివేషన్‌ హైలైట్‌ చేస్తూనే కామెడీ పండించడం  ఆసక్తికరంగా మారింది. అలాగే  హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో రొమాంటిక్‌ సీన్లు కూడా ట్రైలర్‌లో హైలైట్‌ అయ్యాయి.  చివర్లో ‘ మీ టీ ఎం కె ’ అని స్లైలి్‌షగా చెబుతూ ఆగస్టు 19న థియేటర్లలో కలుద్దాం’ అన్నారు సాయికుమార్‌. 

Updated Date - 2022-08-10T05:41:34+05:30 IST