JACQUELINE ని... ఎక్సర్సైజులు మానేసి పొలం పనులకి రమ్మన్న స్టార్ హీరో!
ABN , First Publish Date - 2021-11-29T18:32:48+05:30 IST
.... వారాల తరబడి బాలీవుడ్ సీనియర్ మోస్ట్ బ్యాచిలర్తోనే మిస్ ఫెర్నాండెజ్ ఉండిపోయింది. మధ్యలో ఇద్దరూ కలసి ఓ వీడియో సాంగ్ కూడా చేశారు. ఇక అదే టైంలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇంకేం చేసిందో, తాను ఏం చేయమని చెప్పాడో కూడా సల్మాన్ రీసెంట్గా బయటపెట్టాడు
అప్పట్లో హఠాత్తుగా లాక్డౌన్ విధించటంతో సల్మాన్ తన ఫామ్హౌజ్కే పరిమితం అయిపోయాడు. అయితే, అతడితో పాటూ జాక్విలిన్ కూడా అక్కడే ఉండటం చాలా మందిలో ఆసక్తి రేకెత్తించింది. వారాల తరబడి బాలీవుడ్ సీనియర్ మోస్ట్ బ్యాచిలర్తోనే మిస్ ఫెర్నాండెజ్ ఉండిపోయింది. మధ్యలో ఇద్దరూ కలసి ఓ వీడియో సాంగ్ కూడా చేశారు. ఇక అదే టైంలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇంకేం చేసిందో, తాను ఏం చేయమని చెప్పాడో కూడా సల్మాన్ రీసెంట్గా బయటపెట్టాడు!
‘అంతిమ్’ సినిమా ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ షోకి వచ్చిన సల్మాన్ లాక్డౌన్ కాలంలో జరిగిన సంగతులు చెప్పాడు. ఫామ్హౌజ్లో ఉండిపోయిన తాను రోజంతా మట్టిలోనే గడిపేవాడట. భూమి తొవ్వుతూ, మొక్కలు నాటుతూ ఎంతో సంతృప్తి పొందేవాడట. కానీ, అదే సమయంలో జాక్విలిన్ మాత్రం జిమ్లో ట్రెడ్మిల్పై పరుగులు పెట్టేదని చెప్పాడు సల్మాన్. అలా కార్డియో వర్కవుట్స్ చేయటం వెర్రితనమే అన్నాడు కండల వీరుడు. మరీ ఎక్కువ సేపు కసరత్తులు చేయటం తెలివితక్కువతనమని తేల్చేశాడు. దానికి బదులు మట్టిలో సమయాన్ని గడిపితే ఎంతో ఆహ్లాదంగా ఉండటమే కాక రోజంతా ఒక మంచి పని చేశామని ఫీలింగ్ కలుగుతుందని వివరించాడు. సల్మాన్ చెప్పింది ఖచ్చితంగా నిజమే మరి...