భార్య, పిల్లల మీద బెంగతో గంటల తరబడి కన్నీరుమున్నీరైన ‘మున్నాభాయ్’...

ABN , First Publish Date - 2022-04-16T21:03:08+05:30 IST

క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్‌తో గండం నుంచీ గట్టెక్కిన సంజయ్ దత్ షాకింగ్ విషయాలు చెప్పాడు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే రెండు, మూడు గంటల పాటూ ఏడ్చేశాడట. అందుక్కారణం...

భార్య, పిల్లల మీద బెంగతో గంటల తరబడి కన్నీరుమున్నీరైన ‘మున్నాభాయ్’...

క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్‌తో గండం నుంచీ గట్టెక్కిన సంజయ్ దత్ షాకింగ్ విషయాలు చెప్పాడు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే రెండు, మూడు గంటల పాటూ ఏడ్చేశాడట. అందుక్కారణం, అతడికి భార్య, పిల్లలపైన కలిగిన తీవ్రమైన బెంగేనంటున్నాడు ‘మున్నాభాయ్’. క్యాన్సర్ సోకిందని తెలిసిన మరుక్షణం పిల్లల గురించి, భార్య గురించి, తన జీవితం గురించి, అన్నిటి గురించీ... ఎడతెరిపి లేకుండా ఆలోచనలు పుట్టుకొచ్చాయట. దాంతో ఆందోళన, మానసిక ఒత్తిడికి లోనై సంజయ్ దత్ కళ్ల నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు.


డాక్టర్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ కారణంగా వెంట్రుకలు రాలిపోతాయని ముందుగానే హెచ్చరించారట. వాంతుల కారణంగా వీకైపోతావని చెప్పారట. అన్నిటికీ సమాధానంగా ‘‘నాకు ఏమీ కాదు’’ అంటూ సంజయ్ ఆత్మ విశ్వాసంతో ప్రకటించి... క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి సిద్ధపడ్డాడు. కొద్ది రోజుల్లోనే ముఖానికి మేకప్ వేసుకుని ‘కేజీఎఫ్ 2’ లాంటి సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చేయగలిగాడు! క్యాన్సర్ సర్వైవర్‌గా ఆయన ఎంతో మందికి భరోసాని, ధైర్యాన్ని కలిగిస్తున్నాడు... 

Updated Date - 2022-04-16T21:03:08+05:30 IST