Ajay Devgn వల్లే నేను సింగిల్‌గా మిగిలిపోయానంటూ.. ఐదేళ్ల క్రితం Tabu ఏం చెప్పిందో తెలుసా..?

ABN , First Publish Date - 2022-06-22T18:48:04+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీనటులు అజయ్ దేవ్‌గణ్, టబు చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే...

Ajay Devgn వల్లే నేను సింగిల్‌గా మిగిలిపోయానంటూ.. ఐదేళ్ల క్రితం Tabu ఏం చెప్పిందో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీనటులు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn), టబు (Tabu) చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాలకి పనిచేశారు. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్‌గా నిలిచాయి. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘దృశ్యం  (Drishayam)’ సైతం మంచి హిట్‌గా నిలిచింది. అయితే.. బాల్య స్నేహితులైన వీరిద్దరిలో అజయ్, నటి కాజోల్‌ (Kajol)ని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరూ పిల్లలు కూడా కలిగారు. కాగా.. టబు మాత్రం 50 ఏళ్లకి దగ్గరగా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.


అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో జరుగుతూ తనకు పెళ్లి కాకపోవడానికి కారణాన్ని తెలిపింది. టబు మాట్లాడుతూ.. ‘నా కజిన్ సమీర్ ఆర్య పక్కింట్లో అజయ్ కుంటుంబం ఉండేది. అతనికి మంచి ఫ్రెండ్ కూడా. దీంతో నాకు అజయ్‌తో స్నేహం ఉండేది. దీంతో వారిద్దరూ నాపై ఓ కన్ను వేసి ఉంచేవారు. అంతేకాకుండా వారిద్దరూ పెద్ద రౌడీలు. అందుకే ఎవరైనా అబ్బాయిలు నా వెంటబడినట్లు వాళ్లకి తెలిస్తే కొడతామని బెదిరించేవారు. అజయ్ అలా చేయడం వల్లే నేను సింగిల్‌గా మిగిలిపోయాను. అప్పుడూ అలా చేసినందుకు ఇప్పుడు అజయ్ పశ్చాత్తాప పడుతున్నాడని ఆశిస్తున్నా’ అని సరదాగా చెప్పుకొచ్చింది.


టబు ఇంకా మాట్లాడుతూ.. ‘నేను అందరికంటే ఎక్కువగా అజయ్‌కే రెస్పెక్ట్ ఇస్తాను. అతను పిల్లవాడిలా ఉంటాడు. అలాగే చాలా ప్రొటెక్టివ్‌ కూడా. అతను ఉన్నప్పుడు సెట్‌లో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మా మధ్య ఎటువంటి నియమాలు లేని ప్రత్యేకమైన బంధం ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా.. అజయ్, టబు కలిసి విజయపథ్ (1994), హకీకత్ (1995), తక్షక్ (1999), దృశ్యం (2015), గోల్‌మాల్ ఎగైన్ (2017), దే దే ప్యార్ దే (2019) వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. వారిద్దరూ కలిసి తాజాగా ‘దృశ్యం 2’లో నటిస్తున్నారు.

Updated Date - 2022-06-22T18:48:04+05:30 IST