Taapsee: ‘కాఫీ విత్ కరణ్’ లో కనిపించకపోవడంపై విలేకర్ల ప్రశ్న.. సమాధానమిచ్చిన నటి..

ABN , First Publish Date - 2022-08-07T22:37:54+05:30 IST

బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి తాప్సీ పన్ను(Taapsee Pannu). ‘పింక్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. చివరగా మిథాలీ

Taapsee: ‘కాఫీ విత్ కరణ్’ లో కనిపించకపోవడంపై విలేకర్ల ప్రశ్న.. సమాధానమిచ్చిన నటి..

బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి తాప్సీ పన్ను(Taapsee Pannu). ‘పింక్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. చివరగా మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ (Shabaash Mithu)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘దోబారా’ (Dobaaraa). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాప్సీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) చాట్ షోకు కరణ్ మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

 

కరణ్ జోహార్ తన చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ ను ప్రమోట్ చేస్తున్న రూం పక్కనే తాప్సీ పన్ను ‘దోబారా’ ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా మీడియా వారు కరణ్ చాట్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడిగారు. ‘కాఫీ విత్ కరణ్’ కు ఆహ్వానించేంత ఆసక్తికరంగా తన సెక్స్ లైఫ్ లేదని తాప్సీ సరదాగా చెప్పింది. ‘దోబారా’ వైవిధ్య కథతో, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) దర్శకత్వం వహించాడు. బాలాజీ టెలీ ఫిలిమ్స్ పతాకంపై శోబా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అనేక ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అనురాగ్, తాప్సీ గతంలో ‘మన్మర్జియాన్’ (Manmarziyaan) చిత్రానికి కలసి పనిచేశారు.

Updated Date - 2022-08-07T22:37:54+05:30 IST